షాకింగ్.. అలా పాక్కు వెళ్లిన వంద మంది కశ్మీరీలు గల్లంతు..!
భారత భద్రతా సిబ్బంది సంచలన విషయాలను ప్రకటించింది. గత మూడేళ్లుగా కశ్మీర్ నుంచి తాత్కాలిక వీసాలతో పాక్ వెళ్లిన దాదాపు వంద మంది యువకుల జాడ తెలియడం లేదని ఓ ఐపీఎస్ అధికారి తెలిపారు. విజిటింగ్ వీసాతో పాక్ పర్యటనకు వెళ్లిన వారంతా ఇప్పటి వరకూ తిరిగి రాలేదని గుర్తించారు. వారంతా గల్లంతయ్యారని భావిస్తున్నామని.. అయితే ఇదంతా ఉగ్ర సంస్థల కుట్రగా అధికారలు చెబుతున్నారు. స్లీపర్ సెల్స్లో భాగంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని.. ఉగ్ర సంస్థలు తొలుత యువతను ప్రభావితమయ్యేలా చేస్తారని.. అనంతరం వారికి ఉగ్ర శిక్షణ ఇస్తారని తెలుస్తోంది. భారత్పై వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి అనేక మంది యువత ఆకర్షితులవుతున్నారని.. అలా ఆకర్షితులవుతున్న వారిని తిరిగి రప్పించడం పెద్ద సవాల్గా మారిందని ఓ అధికారి తెలిపారు. అయితే కశ్మీరీ యువకులు దాదాపు వంద మంది వరకు వీసాలను తీసుకుని పాక్ వెళ్లడం.. వారంతా ఇప్పటి వరకు తిరిగి కశ్మీర్కు రాలేదని.. ఇవన్నీ ఉగ్రకుట్రలో భాగమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.