గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత P జనార్దన్ రెడ్డి కుమార్తె, ఖైరతాబాద్ టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే పార్టీ కండువా కప్పుకోకముందే రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రత్యక్షమయ్యారు. పీజేఆర్ వారసత్వాన్ని కొనసాగించేందుకు పార్టీలో చేరుతున్నట్టు ఆమె తెలిపారు. టీఆర్ఎస్ లో ఎంత కష్టపడుతున్నా తగిన గుర్తింపు లేదనే అసంతృప్తిలో ఆమె ఉన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీనే సరైన వేదిక అని భావిస్తున్నట్టు దగ్గరివాళ్లతో చెప్తూ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఉంది. అయితే టికెట్ విషయంగా తాను పార్టీనుంచి ఎలాంటి హామీ తీసుకోలేదని..ఇంకా సమయం ఉంది కదా అని ఆమె అన్నారు.