తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతున్న వేళ.. మరో కీలక నేత పార్టీకి గుడ్బై చెప్పారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన కాంగ్రెస్ నేత మోహన్ రావు పాటిల్ భోస్లే కమలం గూటికి చేరుకున్నారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు సోయం బాపూరావు,ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామ్చందర్ రావు పాల్గొన్నారు.
https://twitter.com/ANI/status/1374619127277445123