పంజాబ్ సీఎం చన్నీ సోదరుడు జస్వీందర్ సింగ్ ధలీవాల్ బీజేపీలో చేరారు. చండీగఢ్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి చేర్చుకున్నారు. ఇంకా మాజీ ఎమ్మెల్యే అరవింద్ ఖన్నా, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) నాయకుడు గురుదీప్ సింగ్ గోషా, అమృత్సర్ మాజీ కౌన్సిలర్ ధరమ్వీర్ సరిన్ కూడా కాషాయదళంలో చేరిపోయారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనున్నాయి.