వెస్ట్ బెంగాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేద్దామనుకున్న మజ్లీస్ పార్టీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. బెంగాల్ రాష్ట్ర చీఫ్ జమీరుల్ హసన్ పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన జమీరుల్.. అసదుద్దీన్పై, ఎంఐఎం పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. అసదుద్దీన్ బీజేపీకి అనుకూలంగా పని చేసేందుకే బెంగాల్ వచ్చారని.. అందుకే ఆయన పార్టీని వీడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. అంతేకాదు.. ఇక్కడ 95 శాతం మంది కార్యకర్తలు తన వెంటే ఉన్నారని.. జమీరుల్ తెలిపారు.
అంతేకాదు.. నందిగ్రామ్ నుంచి పోటీలో ఉన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి తమ మద్దతు ఉంటుందని.. బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పోటీదారులందరికీ మద్దతు తెల్పుతామన్నారు.నందిగ్రామ్లో దీదీకి సపోర్ట్ చేయడం ద్వారా.. బలమైన అభ్యర్ధిగా ఉన్న సువేందు గెలవలేరన్నారు. కాగా, 294 అసెంబ్లీ స్థానాలున్న వెస్ట్ బెంగాల్లో.. మార్చి 27వ తేదీ నుంచి 8 విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి.