బలం నిరూపించుకోవాల్సిన సమయంలో ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి అయిన పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పీటీఐ ,ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ పాకిస్తాన్ (MQM-P) … ప్రతిపక్ష పాకిస్తాన్ పీపుల్స్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఉమ్మడి ప్రతిపక్షం, MQM మధ్య ఒప్పందం కుదిరిందని పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ట్వీట్ చేశారు. దీంతో ఇమ్రాన్ ప్రభుత్వం మైనార్టీలో పడ్డట్టైంది.
“రాబ్తా కమిటీ MQM మరియు PPP CEC ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి. మేము రేపు IA విలేకరుల సమావేశంలో మీడియాతో వివరాలను పంచుకుంటాము. పాకిస్థాన్కు అభినందనలు” అని బిలావల్ భుట్టో జర్దారీ ట్విట్ చేశారు.
అవిశ్వాస తీర్మానంపై కీలకమైన ఓటింగ్కు ముందు అర్థరాత్రి జరిగిన పరిణామం పార్లమెంటు దిగువసభలో పీటీఐ ప్రభుత్వం మెజారిటీని కోల్పోవడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మైనారిటీలో పడిందని తెలిపారు.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యుల బలం ఉంది, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం విజయవంతం కావడానికి ప్రతిపక్షాలకు అవసరమైన సంఖ్య 172. PTI నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 179 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడింది, అయితే MQM-P విడిచిపెట్టిన కారణంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీకి 164 మంది మద్దతు ఇచ్చారు. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఇప్పుడు 177 మంది మద్దతుదారులు ఉన్నారు.
ఒక ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, “పాకిస్తాన్లో ప్రభుత్వాన్నికూల్చేందుకు విదేశీ కుట్ర జరుగుతోంది. బయటినుంచి ఇక్కడివాళ్లకు సొమ్ము అందుతోంది. మమ్మల్ని బెదిరిస్తున్నారు. కానీ జాతీయ ప్రయోజనాల విషయంలో మేం రాజీపడబోం, ఎవరికీ భయపడబోం. ” అని అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)