అసోంలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్ గూటికి చేరిన మిత్రపక్షం..
దేశ వ్యాప్తంగా పాంచ్ పటాకాలా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల గురించి తెలిసిందే. నాలుగు రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతానికి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న అసోం రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షం షాక్ ఇచ్చింది. ఐదేళ్లుగా మిత్రపక్షంగా ఉన్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) బీజేపీకి గుడ్బై చెప్పింది. ఈ విషయాన్ని బీపీఎఫ్ అధ్యక్షుడు హగ్రామ మోహిలరీ తెలిపారు. బీజేపీతో తెగడతెంపులు చేసుకుంటున్నామని.. ఇప్పుడు తాము కాంగ్రెస్ కూటమితో జతకడుతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి, ఐక్యత, అభివృద్ధి సాధన కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అసోంలో అవినీతి రహితమైన స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కూటమితో కలిసి బీపీఎఫ్ పోటీ చేస్తుందని తెలిపారు.