అజంగఢ్, రాంపూర్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఎస్పీ కంచుకోట అయిన అజంగఢ్లో బీజేపీ అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ ‘నిరాహువా’ తన సమీప ప్రత్యర్థి, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్పై 8,679 ఓట్లతో గెలుపొందారు.
బీజేపీకి చెందిన ఘ్యాన్శ్యామ్ సింగ్ లోధి 42,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో మొహమ్మద్ అసిమ్ రాజాను ఓడించి SP నుంచి రాంపూర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రాజాను ఎస్పీ నేత ఆజం ఖాన్ ఎంపిక చేశారు.
ఉప ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. కొద్దిసేపటికే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ఫలితాలను “చారిత్రక విజయం” అంటూ ట్వీట్ చేశారు.
“అజంగఢ్ సదర్ లోక్సభ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో చారిత్రాత్మక విజయం ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ‘డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వం’ ప్రజా సంక్షేమ విధానాల ఫలితం. కష్టపడి పనిచేసే బీజేపీ మద్దతుదారులందరికీ ఈ విజయం అంకితం. నేను అజంగఢ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా”అని ట్వీట్ చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన సమాజ్వాదీ పార్టీ అధినేత రాజీనామా చేయడంతో అజంగఢ్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
అజంగఢ్, ముబారక్పూర్, సాగ్డి, గోపాల్పూర్ సహా మెహ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి.
https://twitter.com/myogiadityanath/status/1541010950966636546?s=20&t=2_KR1L82i2bjXwClNGVyKg