ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతోపాటు కొత్త మంత్రివర్గం బాధ్యతలు స్వీకరించారు మొత్తం 25 మందితో మంత్రివర్గం కొరతరించింది ఇందులో 17 మంది దాకా పూర్తిగా కొత్తవాళ్లు. మిగిలిన వాళ్లు కూడా కొద్ది కాలం పాటు మాత్రమే కీలక పదవులు నిర్వహించిన వాళ్ళు.
మొదటినుంచి తెలుగుదేశం జెండా మోసిన సీనియర్లు అందరినీ పూర్తిగా పక్కన పెట్టేయడం ఆశ్చర్యకరంగా మారింది. మంత్రి పదవులు గ్యారెంటీ అనుకున్న పలువురు సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది..
సీనియర్ల పరంగా చూస్తే యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాస రావు, యరపతినేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, GV ఆంజనేయులు, కూన రవి కుమార్ , కాల్వ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
అలాగే వీరితో పాటు JC అస్మిత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి కొండ్రు మురళీతో పాటు రాష్ట్రం లోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాస రావుకూ అవకాశం దక్కలేదు..
ఇందులో కొందరు నాయకులు అయితే కుటుంబ సభ్యులతో సహా విజయవాడ చేరుకుని నిరీక్షించారు. అయినప్పటికీ మంత్రి పదవులు ఇవ్వడం లేదని సున్నితంగా చెప్పేసి పక్కన పెట్టేశారు. ఇందుకు కారణాలు చూస్తే చాలా లోతులు కనిపిస్తాయి.
వాస్తవానికి తెలుగుదేశంలో సీనియర్లు అంటే 83 నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళు ఉన్నారు. అంటే 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నమాట. చంద్రబాబుతో పాటు సమానంగా రాజకీయ అనుభవం కలిగిన నాయకులు. 2014లో అధికారం దక్కించుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు వీళ్ళలో చాలామందికి మంత్రి పదవి కల్పించారు. తర్వాత కాలంలో చిన్న కొద్దిపాటి మార్పులు జరిగే తప్పితే సీనియర్లు మంత్రులుగా కొనసాగారు.
కానీ ఈసారి ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టేశారు. రాబోయే కాలంలో లోకేష్ కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎందుకో అణువుగా లోకేష్ తో సర్దుకుని పోయేవారు, లోకేష్ అండగా బలంగా నిలబడే వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తాజా మంత్రివర్గంలో అచ్చం నాయుడు నారాయణ వంటి ఒకరిద్దరు తప్పిస్తే మిగిలిన వాళ్లంతా 50 సంవత్సరాల ఏజ్ గ్రూపులో ఉన్నవాళ్లే. తెలుగుదేశం పార్టీలో ప్రయాణం ఈ 15 20 సంవత్సరాల మధ్య కాలంలోనే. అటువంటి టీం కి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. సీనియర్లను మంత్రివర్గంలో పెట్టినట్లయితే తర్వాత కాలంలో మాటిమాటికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ కథలు చెబుతారని ప్రచారం జరుగుతోంది.
ఇక్కడ ఇంకో కోణం కూడా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అన్నదగ్గ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నాయకులకు కొడుకులు రంగ ప్రవేశం చేసేసారు. దాదాపుగా తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ తరా నీ ప్రోత్సహిస్తున్నాం అని చెబుతూ సీనియర్లను పక్కన పెట్టేశారు. అని అంటున్నారు.
ఉదాహరణకు యనమల రామకృష్ణుడిని పక్కనపెట్టి ఆయన కుమార్తె దివ్య కు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. చనిపోయిన ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయ్యారు. బండారు సత్యనారాయణమూర్తి కి ఈయన స్వయంగా అల్లుడు. నిమ్మకాయల చినరాజప్ప గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి సంబంధించి బంధువులకు అవకాశం ఇస్తున్నారు. అలాగే మరికొందరు సీనియర్లలో తర్వాత తరాన్ని రాజకీయంగా ప్రోత్సహిస్తున్నారు.
వైసిపి నాయకులు చెబుతున్న వాదన మరోరకంగా ఉంది. ఇప్పుడు ఈ సీనియర్లను పక్కన పెట్టినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం నష్టం లేదు. ఎందుకంటే వైసిపి పార్టీని భయంకరంగా తిట్టేసి విమర్శించి అధికారం లోకి వచ్చారు. అటువంటి అప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదని అలిగి బయటకు వెళ్లిపోయే పరిస్థితి లేదు. కిమ్మనకుండా పార్టీలోనే కూర్చోవలసి ఉంటుంది.. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న చంద్రబాబు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్నారు.
ఇదే అదనుగా పార్టీలో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించినట్లయితే మరో రెండు తరాలు పార్టీ బలపడుతుందని అగ్ర నాయకత్వం అంచనా వేస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని తెలంగాణలో విస్తరించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది రిటైర్మెంట్ ఇస్తున్న సీనియర్లకు తెలంగాణ జిల్లాల్లోనే కేడర్లతో కూడా సంబంధాలు ఉన్నాయి అందుచేత ఒక్కో సీనియర్ కి రెండో మూడు జిల్లాలు కేటాయిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసేందుకు టిడిపి సీనియర్లను రంగంలోకి దింపుతారు అని చెబుతున్నారు ఈ బాధ్యతను యనమల రామకృష్ణుడికి ఇచ్చే అవకాశం ఉంది ఆయన సామాజిక వర్గమైన యాదవ వర్గీయులు జంట నగరాల్లో బలంగా ఉంటారు కాబట్టి ఆ బాధ్యత కట్టబెడతారని చెబుతున్నారు.
మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో సీనియర్లకు షాక్ అవ్వడం అనేది చర్చనీయాంశంగా మారింది