వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్ ఇస్తూ ముందస్తు బెయిల్ పై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనెల 25 హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాశ్ ముందస్తు బెయిల్పై విచారణ జరపాలని అంది. అదే సమయంలో అప్పటివరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. తన ముందస్తు బెయి ల్ పిటిషన్ను వెకేషన్ బెంచ్ విచారించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి వేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన తల్లికి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు వారం రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు. విచారణ జరిపిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో ధర్మాసనంఅందుకు తిరస్కరించింది. తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే వీలైనంత త్వరగా విచారణ ముగించాలని వెకేషన్ బెంచ్ కు సూచించింది.