అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నాయకుడిగా రికార్డ్ సృష్టించారు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. చత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ పేర ఉన్నరికార్డును ఆయన బ్రేక్ ఇచ్చారు. 15 ఏళ్ల 10 రోజుల పాటు సీఎంగా ఉన్న రికార్డ్ రమణ్ సింగ్ పేర ఉండేది. గురువారంతో ఆ రికార్డును బద్దలు కొట్టారు చౌహాన్. మధ్యప్రదేశ్ సీఎంగా ఆయన 15 ఏళ్ల 11 రోజులు పనిచేశారు.
శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్ సీఎంగా తొలిసారి 2005 నవంబర్లో బాధ్యతలు చేపట్టారు. 2018 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2018 నుంచి 2020 వరకు కమల్నాథ్ సీఎంగా ఉన్నారు. 2020 మార్చిలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో శివరాజ్ సింగ్ మళ్లీ సీఎం పగ్గాలు అందుకున్నారు. దేశంలో సుదీర్ఘకాలం సీఎంగా ఉన్న రికార్డు సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉంది. ఆయన 24 ఏళ్ల పాటు సిక్కిం ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాతి స్థానంలో 23 ఏళ్లు సీఎంగా చేసిన బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన గీగాంగ్ అపాంగ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరుసగా 22 ఏళ్లు ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)