పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో శివ లింగం బయట పడింది. ఏలూరు జిల్లా పోలవరం మండలం సింగన్నపల్లి కంపెనీ వద్ద జరుగుతున్న తవ్వకాల్లో ఈ శివలింగం వెలుగు చూసింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వెనుకభాగంలో అప్రోచ్ ఛానల్ తవ్వకం పనులు జరుగుతున్నాయి. దాదాపు 15 అడుగుల లోతున మట్టి తీస్తుండగా శివలింగం బయటపడింది.
ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్దెత్తున వెళ్లి చూస్తున్నారు. పూర్తిగా మట్టితో నిండి ఉన్నలింగాన్ని శుభ్రంచేశారు. తవ్వకాల వల్ల శివ లింగం కాస్త బీటలు వారింది. గతంలో గోదావరి నదీ తీర ప్రాంతంలో పలు చోట్ల శివాలయాలు ఉండేవి. వరదల వల్ల అవి కనుమరుగు అయ్యాయి. ఆ ఆలయంలోనిదే ఈ లింగం అయిఉండవచ్చని భావిస్తున్నారు..