
ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ దార్శనికతకు శివాజీ ఆలోచనలే ప్రేరణఅని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శివాజీ 350వ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడారు. స్వయంపాలనను చూపించిన శివాజీ బానిసమనస్తత్వం కూడదన్నారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారజు సామ్రాజ్య పట్టాభిషేక ఉత్సవాలను మహారాష్ట్రలో ఉత్సవంగా జరుపుకుంటారని గుర్తు చేశారు. ఇక ప్రస్తుతం జాతీయవాదం పెరిగిందని, జాతీయ శక్తుల ఏకతతో కొత్త శక్తి చైతన్యాల్ని మనం చూస్తున్నామనీ అన్నారు. క్రమంగా బ్రిటిష్ పరిపాలనకు సంబంధించిన గుర్తులను తొలగించి, శివాజీ రాజ ముద్రను వేశామని చెప్పారు.
శివాజీ చాటిన విలువలు, అందించిన ప్రేరణ ఆధారంగా… 25 ఏళ్ల అమృత కాలాన్నిపూర్తి చేయాలన్నారు. ఆయన కన్న కలల భారత దేశంగా తీర్చిదిద్దడమే ఈ ప్రస్థానం లక్ష్యమని తెలిపారు. స్వరాజ్యం, సుపరిపాలన, ఆత్మవిశ్వాసంతో ఈ ప్రయాణం కొనసాగుతుందనిమోదీ అన్నారు.