ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో మొదటిసారి ఓ మహిళాఅధికారి నియమితులయ్యారు. సైన్యంలోని ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ విభాగానికి చెందిన కెప్టెన్ శివ చౌహాన్ రక్షణ బాధ్యతలు చేపట్టారు. కుమార్ పోస్ట్ దగ్గర శివచౌహాన్ నియమించినట్టు సైన్యం ట్విట్టర్లో ప్రకటించింది. అంతకుముందు కొన్నినెలలపాటు ఆమె సియాచిన్ బాటిల్ స్కూల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతల్లో విధులు నిర్వహించడం అంత సులువు కాదు. అందునా మహిళలకు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 15632 అడుగుల ఎత్తులో ఉంటుంది.
శివచౌహాన్ రాజస్థాన్ కు చెందిన వారు. 11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఆమె తల్లి అన్నీ తానై పెంచారు. తల్లి కోరిక మేరకు ఆమె ఎంతో శ్రమపడి భారత సాయుధ దళంలో చేరారు. చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. అసాధారణ ప్రతిభాసామర్థ్యాలు ప్రదర్శించి సియాచిన్ బాటిల్ స్కూల్ శిక్షణకు ఎంపికయ్యారు . అక్కడా శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని కుమార్ పోస్ట్ దగ్గర అధికారిగా నియమితులయ్యారు.
https://twitter.com/ANI/status/1610273773965692928?s=20&t=fbcHieo0Nf0bYKC0-_Rt-w