అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ కు చెందిన ”వంచిత్ బహుజన్ ఆఘాడి” పార్టీతో ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని శివసేన చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్వయంగా ప్రకటించారు. ఉద్ధవ్ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలివి. జనవరి 23 బాలాసాహెబ్ థాకరే జయంతి ఉత్సవమని..ఈ రోజు పొత్తుతో కలిసి ముందుకు వెళ్లేందుకు ఇద్దరూ ఒకే వేదిక మీదకు వచ్చామని ఉద్ధవ్ చెప్పారు.