మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సీఎం ఉద్ధవ్ ను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శివసేన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. మహారాష్ట్రలో పరిస్థితి ఇలా ఉంటే… ఇక అసోంలో ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ టూరిస్టులుగా మారిపోయి రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. తమ నాయకుడు ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో వారంతా కామాఖ్య ఆలయాన్ని దర్శించారు. అసలైతే బుధవారం రాత్రికి వారంతా గోవా వెళ్తారని ప్రచారం జరిగింది. గోవా బీజేపీ పాలిత ప్రాంతం కావడం..ముంబై సమీపంలో ఉండడంతో అక్కడికి వెళ్లాలని రెబెల్ టీం నిర్ణయించింది. గోవాలోని ‘ తాజ్ రిసార్ట్ అండ్ కన్వెన్షన్ సెంటర్’లో 70 రూమ్లను ఇదివరకే బుక్ చేసుకున్నారనీ వార్తలు వచ్చాయి. స్పైస్జెట్కి చెందిన ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ కూడా సిద్ధం చేసుకున్నారు కూడా. అయితే చివరి నిమిషంలో వాళ్లంతా ప్లాన్ మార్చారు. బలనిరూపణకు సంబంధించి గవర్నర్ ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన సుప్రీంకోర్ట్లో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో..వేచిచూడాలని ఇంకొంతకాలం కదలకుండా అసోంలోనే ఉండాలని నిర్ణయించారు. గోవా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. కామాఖ్య అమ్మవారి దర్శనం అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. గురువారం తాను, తన వెంట ఉన్న 50మంది ఎమ్మెల్యేలం ముంబై చేరుకుంటామని అన్నారు. మూడింట రెండొంతుల మెజారిటీ తనకుందని… ఏ పరీక్షలో అయినా నెగ్గుతామని ధీమాగా చెప్పారు.
I'm here to pray for the peace & happiness of Maharashtra. Will go to Mumbai tomorrow for the floor test & follow all the process: Rebel Shiv Sena leader Eknath Shinde, in Guwahati, Assam pic.twitter.com/ErHwhz6Ny2
— ANI (@ANI) June 29, 2022
అటు గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్ నుంచి కామాఖ్య దర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యేలతో అసోం పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి పియూష్ హజారికా, ఇతర బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు ఉన్నారని సమాచారం.