పాత్రాచల్ కుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని.. ఈరోజు మధ్యాహ్నం పీఎంఎల్ఏ కోర్టు ముందు హాజరుపరిచారు. ఆయనను 8 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడంతో నాలుగురోజుల పాటు కస్టడీకి కోర్టు అనుతించింది. ఇప్పటిదాకా దర్యాప్తు బృందంకు సరిగా స్పందించకపోవడంతో, తదుపరి విచారణ కోసం ED అతనిని నిన్న అదుపులోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి జూలై 1న సంజయ్ రౌత్ ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఆ తర్వత కూడా సంజయ్ ను విచారణకై ఈడీ రెండుసార్లు పిలిచింది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలను కారణంగా చూపుతూ ఆయన అధికారుల ముందు హాజరుకాలేదు. నిన్న ఉదయం ఆయన నివాసానికి చేరుకున్న ఈడీ బృందం ఆయన్ని ప్రశ్నించి.. ఇంట్లో సోదాలు చేసింది. 11.5 లక్షల నగదును జప్తు చేశారు. సంజయ్ రౌత్ తోపాటు, ఆయన కుటుంబ సభ్యులపై 1034కోట్ల భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ఆ మొత్తం డబ్బు గురించి సంజయ్ రౌత్ ను ప్రశ్నించగా.. 10 లక్షలు పార్టీకి సంబంధించినవని.. 1.50 లక్షలు తన ఇంటి మరమ్మతులకు ఉద్దేశించినవని ఆయన వివరించారని ఈడీ వర్గాలు తెలిపాయి.
ఇదే కేసులో ఈడీ ఏప్రిల్ లో సంజయ్ సతీమణి వర్ష రౌత్, ఆయన ఇద్దరు సన్నిహితులు సుజిత్ పట్కర్, ప్రవీణ్ రౌత్ లకు సంబంధించిన 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.