మన తెలంగాణ శిశుమందిర్ విద్యార్థులు జాతీయ స్తాయిలో రాణిస్తున్నారు. తాజాగా జాతీయ హైస్కూల్ స్థాయి విద్యార్థులకు జాతీయ స్థాయిలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో మన తెలంగాణ అమ్మాయి టాపర్ గా నిలిచింది.
ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో అఖిల భారతీయ ఛాత్ర నిబంధ ప్రతియోగిత పేరుతో వ్యాస రచన పోటీలు నిర్వహించారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇందులో పోటీ పడ్డారు. సిద్దిపేట శ్రీ సరస్వతీ శిశుమందిర్ కు చెందిన అయిదో తరగతి విద్యార్థిని కాసోజు లక్ష్మీ హంసిని మొదటి బహుమతి గెలుచుకున్నారు. శిశుమందిర్ విద్యార్థులు తెలుగులో చురుకుగా ఉన్నా, ఇంగ్లీషులో ప్రావీణ్యం కాస్త తక్కువ అని కొందరు ప్రచారం చేస్తుంటారు. కానీ దీనిని కాదని నిరూపిస్తూ.. జాతీయ స్థాయిలో జరిగిన ఇంగ్లీషు వ్యాస రచనలో శిశుమందిర్ విద్యార్థిని మొదటి బహుమతి గెలుచుకోవటం జరిగింది.
ఈ సందర్భంగా సిద్దిపేట శిశుమందిర్ లో లక్ష్మీ హంసిని కి సత్కారం చేయటం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన ఆచార్యులు మోతుకు నరేష్ కుమార్ మాట్లాడుతూ క్రమశిక్షణ, నేర్చుకోవాలన్న తపన ఉంటే గెలుపు తథ్యం అని లక్ష్మీ హంసిని నిరూపించారు అని అన్నారు. విజేత లక్ష్మీ హంసినికి జాతీయ స్తాయి ప్రశంసా పత్రం మరియు షీల్డ్ ఇచ్చి సత్కరించారు. లక్ష్మి హంసినికి విభాగ్ పెద్దలు, ప్రాంత స్థాయి పెద్దలు శుభాకాంక్షలు తెలియచేశారు.