ఎన్నాళ్లకెన్నాళ్లకు తెరుచుకుంది. .శీతల్నాథ్ ఆలయం…
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 31 ఏళ్లు అవుతోంది ఆ ఆలయం మూతపడి.. కాదు కాదు. మూతపడేలా చేశారు. శ్రీనగర్లోని హబ్బా కదల్ ప్రాంతలో హిందువుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. జిహాదీ మూకలు చేసిన దాడులతో అక్కడి హిందువులు భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో అక్కడి నుంచి హిందువులు ప్రాణ భయంతో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఉగ్రవాదులకు అడ్డాగా మారడంతో.. అటువైపు చూసేందుకు ఎవ్వరు కూడా సాహసం చేయలేదు. దీంతో అక్కడే ఉన్న శీతల్నాథ్ దేవాలయం పూర్తిగా మూతపడిపోయింది.
అయితే మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. క్రమ క్రమంగా లోయలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుండటంతో.. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. అంతేకాదు.. జమ్ముకశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తి ఆర్టికల్ 370 రద్దుతో అక్కడికి మెల్లిగా మెల్లిగా ముప్పై ఏళ్ల క్రితం వెల్లిపోయిన వారంతా చేరుకుంటున్నారు. ఉగ్రవాదుల ప్రభావం తగ్గడంతో.. సుదీర్ఘకాలం తర్వాత వసంత పంచమిని పురస్కరించుకుని ఆలయాన్ని తెరిచారు. దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని 31 ఏళ్ల తర్వాత పునర్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని భక్తులు వాపోయారు.