దేశంలో ఉరికంబం ఎక్కనున్న తొలి మహిళ ఈమే.. రీజన్ ఇదే
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. ఇప్పటి వరకు అనేక మందిని ఉరి తీశారు. కానీ వారిలో ఒక్కరు కూడా మహిళలు లేరు. డెబ్బై నాలుగు ఏళ్ల తర్వాత.. తొలిసారి ఓ మహిళను ఉరి తీయనున్నారు. యూపీకి చెందిన షబ్నమ్ అనే మహిళ తన ప్రియుడి కోసం తన కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా చంపేసింది. అది కూడా ఒకర్ని ఇద్దర్ని కాదు.. ఏకంగా మొత్తం ఏడుగురిని హతమార్చింది. 2008లో ఈ సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో తల్లిదండ్రులతో పాటు.. ఇద్దరు సోదరులను, వారి భార్యలను, పది నెలలు ఉన్న బాబు ఉన్నారు. ఈ కేసులో అలహాబాద్ కోర్టు షబ్నమ్కు ఉరిశిక్ష విధించింది. అయితే ఉరిశిక్షను రద్దు చేయాలంటూ సుప్రీ కోర్టుకు ఎక్కింది. అయితే కేసు విచారణ చేపట్టిన సుప్రీం.. పిటిషన్ను కొట్టి పారేసింది. అంతేకాదు.. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో త్వరలోనే షబ్నమ్ను ఉరితీసే అవకాశం ఉంది. అదే కానీ జరిగితే.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఉరికంబం ఎక్కబోయే తొలి మహిళగా షబ్నమ్ అయ్యే అవకాశం ఉంది.