వివాహం ఇష్టం లేని ఒక అమ్మాయి పెళ్లిని తప్పించుకోవడానికి కాబోయే భర్త గొంతుకోసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కోమళ్లపూడిలో చోటుచేసుకుంది. బాధితుడు రాము నాయుడు హైదరాబాద్లోని సీఎస్ఐఆర్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు. ఆ అమ్మాయితో అతని వివాహం మే 26న జరగాల్సి ఉంది. అమ్మాయి రావికమతం కి చెందిన పుష్పగా గుర్తించారు. వారివురు ఫోన్లో మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి ఇటీవల అతనికి గిఫ్ట్ ఇస్తానని చెప్పి తన గ్రామానికి రమ్మని అడిగింది, రాము వెళ్ళాడు. ఇద్దరూ కలిసి వడ్డాది, కోమళ్లపూడి దగ్గర్లోని జ్యోతిర్మయి బాబా దివ్యక్షేత్రాన్ని సందర్శించారు. కాసేపయ్యాక కళ్ళుమూసుకో నీకో గిఫ్ట్ ఇస్తానని చెప్పి, చున్నీతో కళ్ళకు గంతలు కట్టింది. వెంట తెచ్చుకున్న కత్తితో కంఠం కోసేసింది. రక్తస్రావంతో రక్తపుమడుగులో ఉన్న వ్యక్తిని తానే స్కూటీపై తీనుకొని రావికమతం ఆరోగ్యకేంద్రానికి తీసుకొచ్చింది. మెట్టపైనున్న బాబా గుడికి వెళ్లి తిరిగి వస్తూ కిందికి దిగుతుండగా కిందపడిపోయామని, ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయని నమ్మించే ప్రయత్నం చేసింది. కోలుకున్న యువకుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)