కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉన్న అభ్యర్ధుల్లో టికెట్టు ఆశించి భంగ పడ్డ వారితో మరో తలనొప్పి మొదలైంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కేరళలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. తనకు టికెట్టు ఇవ్వలేదని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్ లతికా సుభాష్ నిరసన తెలిపారు. అంతేకాదు.. తిరువనంతపురం పార్టీ కార్యాలయం ముందు కూర్చుని గుండుచేయించుకుని.. నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పార్టీకి గుడ్బై చెప్తూ రాజీనామా లేఖను విడుదల చేశారు.