కుమార స్వామి పుట్టిన రోజు అయిన మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రమణ్య షష్టిగా భావిస్తారు.
ఈసారి పండగ విషయంలో చిన్న ఇబ్బంది ఏర్పడుతోంది.
సుబ్రహ్మణ్య షష్టి శుక్రవారమా లేదా శనివార మా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం ఉదయం దాకా షష్టి తిథి కనిపిస్తోంది. అందుచేత ఈ అనుమానాలు కలుగుతున్నాయి. కానీ హైందవ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయంలో ఉన్న తిధిని పాటిస్తూ ఉంటాం. అందుచేత శనివారం నాడు సుబ్రహ్మణ్య షష్టి చేసుకోవాలి.
పండగ నాడు ఉదయాన్నే స్నానం చేసి, సుబ్రహ్మ ణ్యస్వామి ని పువ్వులు, పండ్లు, పడగల తో అర్చించాలి. జాతక పరంగా ఇబ్బందులు పడుతున్నవారు.. సుబ్రహ్మణ్య షష్టి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
“శరవణభవ” అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని జపించటంతో మంచి ఫలితాలు వస్తాయి. అందుచేత శనివారం మరిచిపోకుండా పూజ చేసుకొందాం.