దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన లవ్ జిహాద్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన కామెంట్స్ చేశారు. అసలు లవ్ జిహాద్ అనేది ఓ అసంబద్దమైనదంటూ ఆరోపించారు. ఇంతకు దేశంలో లవ్ జిహాద్పై ఎన్ని కేసులు నమోదు చేయబడ్డాయి..? అంటూ ప్రశ్నించారు. గురువారం నాడు కేరళ కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయని.. వారు ఏం తినాలో.. ఎలాంటి బట్టలు వేసుకోవాలో.. ఎవరిని ప్రేమించాలో రాజకీయ నేతలు చెప్పడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, కేరళలో లవ్ జిహాద్ అంశం రాజకీయంగా హీటెక్కిస్తోంది. ముఖ్యంగా అక్కడి క్రైస్తవ, హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని ముస్లిం వర్గానికి చెందిన కొందరు యువకులు ప్రేమ పేరుతో వివాహమాడి మతం మార్చుతున్నారన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. పలు క్రైస్తవ సంస్థలు లవ్ జిహాద్ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ తన మ్యానిఫెస్టోలో కూడా లవ్ జిహాద్ నిరోధక చట్టం తీసుకోస్తామని ప్రకటించింది. అయితే కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు.. కేరళలో హాట్ టాపిక్గా మారాయి.
https://twitter.com/ANI/status/1377600485138472963