లా స్టూడెంట్ శర్మిష్ఠ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. నిండా పాతికేళ్లు లేని ఒక స్టూడెంట్ ను మమతా బెనర్జీ అన్యాయంగా అరెస్టు చేయటాన్ని దేశమంతటా తప్పు పడుతున్నారు. ఇక్కడ మమతా బెనర్జీ చేసిన తప్పులు చూస్తే .. ఓటు బ్యాంకు రాజకీయాలు అర్థమై పోతాయి. దీనిని బట్టి మమతా బెనర్జీ మరియు ఆమెకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల వైఖరి అర్థం అయిపోతాయి. ఇక్కడే మమతా బెనర్జీ సెల్ఫ్ గోల్ చేసుకొందని అర్థం చేసుకోవాలి.
….
అసలు శర్మిష్ఠ ఎవరో తెలుసుకొందాం. పూణే లో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న లా స్టూడెంట్. సోషల్ మీడియాలో అనేక జాతీయ భావాల మీద అభిప్రాయాలు పంచుకొంటూ ఉంటారు. పహల్గామ్ దాడుల మీద దేశమంతా కదిలిపోయింది. పాకిస్థాన్ చేసిన దుర్మార్గాలను ఖండించింది. అయినప్పటకిీ బాలీవుడ్ లోని చాలా మంది సినిమా ప్రముఖులు నోరు మెదపలేదు. దీనిని ప్రశ్నిస్తూ.. ఆమె కొన్ని పోస్టులు పెట్టారు. ఈ సందర్బంగా కొన్ని ఆవేశపూరితమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకొంటున్నానని చెప్పి, ఆమె ఈ వీడియో ను డిలీట్ చేశారు. అంతే కాకుండా ఈ విషయంలో ఎవరిని అయినా నొప్పించి ఉంటే క్షమించాలి అంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అది ఆమె హుందాతనాన్ని తెలియచేస్తోంది.
….
శర్మిష్ట మీద కోల్ కతా సహా కొన్ని చోట్ల పోలీసు స్టేషన్ లలో కొంతమంది ఫిర్యాదులు అందించారు. మిగిలిన రాష్ట్రాలలో ఆయా ఫిర్యాదులు నమోదు చేసుకొని.. వివరాలు తీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర దీశారు. వెంటనే తమ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించి, శర్మిష్ఠ కోసం వేట మొదలు పెట్టారు. ఒక మామూలు లా స్టూడెంట్ కొన్ని వ్యాఖ్యలు చేస్తే, వాటి మీద మొత్తం పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. చివరకు గుర్ గావ్ లో ఆమెను పట్టుకొని అరెస్టు చేసి జైలు లో వేయించారు. రెండు వారాల పాటు జైలులో బంధించేలా కుట్రకు దిగారు.
…..
నిజానికి శర్మిష్ట వ్యాఖ్యలు బాలీవుడ్ లోని ఖాన్ బ్యాచ్ మీద చేశారు. బాలీవుడ్ లో తిష్ట వేసి, దేశ ప్రజల డబ్బులతో కోట్లకు పడగలు ఎత్తిన ఖాన్ బ్యాచ్ హీరోలు ఎందుకు స్పందించటం లేదు అని ప్రశ్నించారు. అంటే ముంబై ప్రాంతానికి చెందిన హీరో ల మీద. మరో వైపు,, ఆమె చదువుతున్నది పూణే లోని న్యాయ కళాశాలలో. పోనీ అంటే,, ఆమె ప్రస్తుతం ఉంటున్నది గుర్ గావ్ అంటే హర్యానా రాష్ట్రంలో. ఇందులో ఏ ఒక్క అంశానికి పశ్చిమ బెంగాల్ తో సంబంధం లేదు. అయినప్పటికీ, కొందరు వ్యక్తుల చేత హర్ట్ అయ్యాము అని చిన్న ఫిర్యాదు పెట్టించి, శర్మిష్ఠను అరెస్టు చేయించేందుకు మమతా బెనర్జీ ఉరకలు వేశారు. ఇదంతా బెంగాల్ లోని మైనార్టీల ఓట్లను బలపరుచుకొనేందుకు అనటంలో సందేహం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మమతా ఎంతకైనా తెగిస్తారు అనేందుకు ఇది ఉదాహరణ.
….
ఇక్కడే మరో పాయింట్ కూాడా గమనించాలి. గతంలో త్రణమూల్ కాంగ్రెస్ నాయకులు సనాతన ధర్మం మీద అనరాని మాటలు అన్నారు. స్వయంగా మమతా బెనర్జీ కూడా ఇదే మాదిరిగా వ్యాఖ్ల్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ట్విటర్ పోస్టులో ఈ వీడియోను పోస్టు చేశారు కూడా. అటువంటప్పుడు వేరే రాష్ట్రాల పోలీసులు కూడా పశ్చిమ బెంగాల్ వెళ్లి, త్రణమూల్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పట్టుకొని వచ్చేయవచ్చు. చట్టాల్లోని కొన్ని చిన్న చిన్న పాయింట్లను తీసుకొని చెలరేగితే, రేపు అదే పరిస్థితి త్రణమూల్ నేతలకు కూడా వర్తిస్తుంది అని గమనించాలి.
…..
మొత్తం మీద దేశ వ్యాప్తంగా శర్మిష్టకు యూత్ లో పెద్ద ఎత్తున మద్ధతుు వ్యక్తం అవుతోంది. ఆమె అరెస్ట్ను డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ తీవ్రంగా ఖండిచారు. ఆమెను విడిపించాలి అంటూ ఆయన ప్రధాని నరేంద్రమోదీని సోషల్ మీడియా వేదికగా విజ్నప్తి చేశారు. మరో వైపు పవన్ కళ్యాణ్, కంగానా రనౌత్ వంటి ప్రముఖులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు.
#I Stand with Sharmishta ,, #Release Sharmistha ,,, #Free Sharmishta పేరుతో హ్యాష్ ట్యాగ్ లు పెట్టుకొని సోషల్ మీడియాలో యువత పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది.
…..
విచిత్రం ఏమిటంటే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం గగ్గోలు పెట్టే మన కుహానా మేధావులు మాత్రం నోరు మెదపటం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన, బీజేపీ తప్పితే ఇతర పార్టీల నేతలు కిక్కురు మనటం లేదు. ఇది చాలా దౌర్భాగ్యం.