కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు షర్మిళ.
ఎన్నికలు వచ్చేశాయ్.. కుంభకర్ణుడు నిద్రలేచాడని ఆమె వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం కొత్త, పాత పథకాలకు తెరలేపుతున్నారని, ఇండ్లకు పైసలిస్తాడట.. పోడు పట్టాలిస్తాడట అని వెక్కిరించారు.
బీసీలకు ఆర్థికసాయం చేస్తాడట.దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదంటూ ట్వీట్ చేశారామె.
13 లక్షల డబుల్ బెడ్ రూం దరఖాస్తులకు 30 వేలు కూడా ఇయ్యలేనోడు ఎన్నికలు వచ్చే సరికి నియోజకవర్గానికి 3 వేల మందికి మూడు లక్షల చొప్పున ఇస్తానని మోసపు మాటలు చెప్తున్నారని షర్మిల అన్నారు.
గతంలో 15 రోజుల్లోనే మూడు లక్షలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ దొర, ఇప్పుడు ముందు రూ.లక్ష, ఎన్నికల్లో గెలిస్తే రూ.లక్ష అంటూ తిరకాసు పెడుతున్నారని సెటైర్ వేశారు. ఇండ్ల పేరుతో 30 లక్షల కుటుంబాలను దగా చేసే పనిలో పడ్డాడని సీఎంపై మండిపడ్డారు.గెలిచిన 9 ఏళ్లలో ఒక్క ఎకరాకు పోడు పట్టా ఇయ్యని కేసీఆర్ ఎన్నికల ముందు పోడు పట్టాలు ముందటేసుకుండని తనదైన శైలిలో ఆరోపించారు. పోడు భూములు 13.18 లక్షల ఎకరాలు ఉంటే 4.01లక్షల ఎకరాలకే పట్టాలు ఇచ్చి, చేతులు దులుపుకొని, ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడనీ అన్నారు.
ముందు కొన్ని ఇచ్చి, మిగతావి ఎన్నికల తర్వాత ఇస్తానని మభ్య పెట్టడానికా? అని నిలదీశారు.తొమ్మిదేండ్లుగా బీసీలను నిండా ముంచిన దొరను మళ్లీ బీసీల ఓట్లు అడిగితే గుంజి కొడతారని అన్నారు.
బీసీ కుల వృత్తులకు లక్ష పేరిట ఓట్లను కొనే పథకాన్ని ప్రవేశపెట్టాడని రాసుకొచ్చారు.9 ఏళ్లుగా 4.77 లక్షల బీసీ లోన్ల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు కానీ.. ఇప్పుడు నియోజకవర్గానికి 2 వేల మందికి లక్ష రూపాయలు ఇస్తాడన్న ఆమె..
అందుకే ఎన్నికలు ఉంటేనే దొర బయటకు వస్తాడన్నారు.
పథకాల పేరుతో వంచిస్తాడని, ప్రజలను బురిడీ కొట్టిస్తాడు. అర చేతిలో వైకుంఠం చూపిస్తాడనీ ట్విట్టర్ వేదిగ్గా అన్నారామె.
పదో పరకో ఇచ్చి ఉద్దరించినట్లు మాటలు చెప్తాడు. తీరా ఓట్లు పడ్డాక.. ప్రజలకు పంగనామాలు పెడతాడు. గత ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్ధానాలు సంగతేంది దొరా? అని ప్రశ్నించారు.
రుణమాఫీకి దిక్కు లేదు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి లేదు. దళితులకు మూడెకరాల భూమి లేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఉచిత ఎరువులు పత్తా లేవు,
ఈసారి మళ్ళీ కేసీఆర్ పథకాలను, మాటలను నమ్మితే మిగిలేది గుండు సున్నానే అంటూ ముగించారు షర్మిళ..
బురిడీ కొట్టిస్తాడు, అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు – కేసీఆర్ పై షర్మిల ట్వీట్
ఎన్నికలు వచ్చేశాయ్.. కుంభకర్ణుడు నిద్రలేచాడని ఆమె వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం కొత్త, పాత పథకాలకు తెరలేపుతున్నారని, ఇండ్లకు పైసలిస్తాడట.. పోడు పట్టాలిస్తాడట అని వెక్కిరించారు.
బీసీలకు ఆర్థికసాయం చేస్తాడట.దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదంటూ ట్వీట్ చేశారామె.
13 లక్షల డబుల్ బెడ్ రూం దరఖాస్తులకు 30 వేలు కూడా ఇయ్యలేనోడు ఎన్నికలు వచ్చే సరికి నియోజకవర్గానికి 3 వేల మందికి మూడు లక్షల చొప్పున ఇస్తానని మోసపు మాటలు చెప్తున్నారని షర్మిల అన్నారు.
గతంలో 15 రోజుల్లోనే మూడు లక్షలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ దొర, ఇప్పుడు ముందు రూ.లక్ష, ఎన్నికల్లో గెలిస్తే రూ.లక్ష అంటూ తిరకాసు పెడుతున్నారని సెటైర్ వేశారు. ఇండ్ల పేరుతో 30 లక్షల కుటుంబాలను దగా చేసే పనిలో పడ్డాడని సీఎంపై మండిపడ్డారు.గెలిచిన 9 ఏళ్లలో ఒక్క ఎకరాకు పోడు పట్టా ఇయ్యని కేసీఆర్ ఎన్నికల ముందు పోడు పట్టాలు ముందటేసుకుండని తనదైన శైలిలో ఆరోపించారు. పోడు భూములు 13.18 లక్షల ఎకరాలు ఉంటే 4.01లక్షల ఎకరాలకే పట్టాలు ఇచ్చి, చేతులు దులుపుకొని, ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడనీ అన్నారు.
ముందు కొన్ని ఇచ్చి, మిగతావి ఎన్నికల తర్వాత ఇస్తానని మభ్య పెట్టడానికా? అని నిలదీశారు.తొమ్మిదేండ్లుగా బీసీలను నిండా ముంచిన దొరను మళ్లీ బీసీల ఓట్లు అడిగితే గుంజి కొడతారని అన్నారు.
బీసీ కుల వృత్తులకు లక్ష పేరిట ఓట్లను కొనే పథకాన్ని ప్రవేశపెట్టాడని రాసుకొచ్చారు.9 ఏళ్లుగా 4.77 లక్షల బీసీ లోన్ల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు కానీ.. ఇప్పుడు నియోజకవర్గానికి 2 వేల మందికి లక్ష రూపాయలు ఇస్తాడన్న ఆమె..
అందుకే ఎన్నికలు ఉంటేనే దొర బయటకు వస్తాడన్నారు.
పథకాల పేరుతో వంచిస్తాడని, ప్రజలను బురిడీ కొట్టిస్తాడు. అర చేతిలో వైకుంఠం చూపిస్తాడనీ ట్విట్టర్ వేదిగ్గా అన్నారామె.
పదో పరకో ఇచ్చి ఉద్దరించినట్లు మాటలు చెప్తాడు. తీరా ఓట్లు పడ్డాక.. ప్రజలకు పంగనామాలు పెడతాడు. గత ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్ధానాలు సంగతేంది దొరా? అని ప్రశ్నించారు.
రుణమాఫీకి దిక్కు లేదు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి లేదు. దళితులకు మూడెకరాల భూమి లేదు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఉచిత ఎరువులు పత్తా లేవు,
ఈసారి మళ్ళీ కేసీఆర్ పథకాలను, మాటలను నమ్మితే మిగిలేది గుండు సున్నానే అంటూ ముగించారు షర్మిళ..
Share: