చిన్నారి హత్యాచార ఘటన అమానుషమని వైసీపీ తెలంగాణ చీఫ్ వైఎస్ షర్మిళ అన్నారు. ఘటన జరిగి ఆరు రోజులవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. చైత్ర కుటుంబసభ్యులను పరామర్శించిన షర్మిళ…ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. కేసీఆర్ నోరు విప్పి, బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తాన్నారు.