వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంను కలిశారు. నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఇద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ప్రధానంగా చర్చించారు. నిరుద్యోగుల భరోసా కోసం టీ సేవ్ ఫోరం ఏర్పాటు చేస్తున్నట్టు సమావేశం అనంతరం షర్మిల ప్రకటించారు. షర్మిళతో కలిసి వెళ్లేవిషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం అన్నారు. నిరుద్యోగులకోసం పోరాడాల్సిన అవసరం ఉందని కోదండ అన్నారు.రాష్ట్రంలో పేపర్ల లీకేజీ వల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర గందరగోళం చెందుతున్నారని ఆయన అన్నారు.నిన్నా ఇవాళ టెన్త్ పేపర్ లీక్ కావడం ప్రభుత్వం నిర్లక్ష్యమేనని మండిపడిన కోదండ… విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు.
https://twitter.com/realyssharmila/status/1643161029415952384?s=20
కోదండరాంతో షర్మిళ భేటీ – నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై కలిసి పోరాడుదామని ప్రతిపాదన
https://twitter.com/realyssharmila/status/1643161029415952384?s=20
Share: