వైఎస్సార్టీపీ నేత షర్మిళను పోలీసులు అరెస్ట్ చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై ఆమె చేయి చేసుకోవడమే కారణం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు బయల్దేరిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులపై చేయి చేసుకున్నారు. ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను చెంపదెబ్బ కొట్టిన ఆమె..మరికొందరిని నెట్టేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆమెకు వాగ్వాదం జరిగింది. తనను అడ్డుకోవడంపై నిరసన తెలుపుతూ షర్మిల రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తానేం ధర్నాకో, ముట్టడికో పిలుపునివ్వలేదని..తానే మర్డరర్ నో , టెర్రరిస్టునే కానని..బయటకువెళ్లకుండా ఎలా అడ్డుకుంటారని ఆమె నిలదీశారు. ‘ వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేస్తారా… చుట్టూ వందలాదిమంది పోలీసుల పహారా ఎఁదుకు…నాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం తప్పెలా అవుతుంది ” అని షర్మిల ప్రశ్నించారు. అయితే విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నందుకు షర్మిలపై ఐపీసీ 330.353 సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. ఈ ఘటనపై షర్మిల పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అటు షర్మిల పట్ల పోలీసుల ప్రవర్తన సరిగా లేదని షర్మిల తల్లి విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
డ్యూటీలో ఉన్న ఎస్సై, కానిస్టేబుళ్లపై చేయి చేసుకున్న షర్మిల – కేసునమోదు
Share: