దేశంలోనే తొలి మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శారదా మీనన్ కన్నుమూశారు. పలు ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె 98 ఏళ్లవయసులో కొద్దిసేపటిక్రితం చనిపోయారు. మంగళూరులో పుట్టిన డాక్టర్ శారద.. మద్రాస్ మెడికల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బెంగళూరులోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్’ సైకియాట్రీలో శిక్షణ పొందారు. ఉద్యోగరీత్యా రిటైర్డ్ అయినా తన సేవలు కొనసాగించారామె. ఆత్మహత్యల డాక్టర్ లక్ష్మీ విజయ్కుమార్ తో ‘స్నేహ’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి…మానసిక రోగుల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. 1992లో భారత ప్రభుత్వం డాక్టర్ శారదను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.