ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్టు ఆయన ప్రకటించారు. పవార్ నోట ఊహించని మాట రావడంతో అంతా షాకయ్యారు. అక్కడే ఆయనకు మద్దతుగా పెద్దఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే తాను కేవలం అధ్యక్ష పదవినుంచి మాత్రమే వైదొలగుతున్నానని…రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ జీవితం నుంచి ప్రజల నుంచి తాను దూరం కావడం లేదని చెప్పారు.
చాలాకాలంగా ఎన్సీపీలో అంతర్గత కుమ్ములాటలున్నాయి. శరద్ పవార్ సోదరుడి కుమారుడైన అజిత్ పవార్ గతంలోనూ పలుమార్లు అసమ్మతి స్వరం వినిపించారు. ఈ సమయంలో శరద్ పవార్ నిర్ణయంపై చ్రచ జరుగుతోంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఆయన వైదొలగితే పార్టీకి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1999లో సోనియా విదేశీయతను ప్రశ్నిస్తూ శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ పార్టీని వీడి..ఎన్సీపీని స్థాపించారు. అప్పటినుంచి పార్టీని శరద్ పవార్ ఒంటిచేత్తో నడిపిస్తున్నారు. మహారాష్ట్రలో మహా అఘాడీ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా శరద్ పవార్ నిర్ణయంతో కూటమిలో గందరగోళం నెలకొంది.
మరో ఏడాదిలో భారత పార్లమెంట్ కు ఎన్నికలు జరుగుతున్న వేళ జాతీయ స్థాయిలో బీజేపీపై విపక్షాలను ఏకతాటిపైకి తేవడంతో ఆయన కృషి చేస్తున్నారు.
https://twitter.com/ANI/status/1653300033721335808?s=20