ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ లో ఇద్దరూ దాదాపు అరగంటపాటు మాట్లాడుకున్నారు. మహారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి నేతలపై…ముఖ్యంగా ఎన్సీపీ, శివసేన నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ ఈడీ వరుస వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో మోదీతో పవార్ భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల క్రితం శివసేనలో నెంబర్ టూగా ఉన్న సంజయ్ రౌత్ కు చెందిన ఆస్తులను ఈటీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని…శరద్ పవార్ మోదీతో భేటీ అవడాన్ని అంత పెద్దది చేయాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. రాష్ట్రానికి చెందిన అభివృద్ధికి సంబంధించి ఓ ముఖ్యనేత మరో ముఖ్యనేతను కలిశారని ఆయన చెప్పుకొచ్చారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)