మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆయన కూతురు, పార్టీ అధినేత్రి సుప్రియా సూలే ముంబైలోని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసంలో కలిశారు. ఠాక్రే మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వెంటనే ఈ సమావేశం జరిగింది. అంతకుముందు ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరితే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సేన నాయకులు, శాసనసభ్యులు తనకు వ్యతిరేకంగా ఉంటే పార్టీ చీఫ్ పదవిని కూడా వదులుకుంటానని ఆయన అన్నారు.