సిక్కు మత గురువు గురుగోవింద్ సింగ్ కుమారులైన అజిత్ సింగ్, జుజ్హర్ సింగ్, జొరావార్ సింగ్, ఫతేసింగ్ల ఆత్మబలిదానాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వారిబలిదానాలకు గుర్తుగా మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో వీర్ బల్ దివస్ కార్యక్రమంలో ప్రధానిపాల్గొన్నారు. ఇందులో భాగంగా 300 మంది కీర్తనాకారులు పాడిన ‘శబద్ కీర్తన్’లో ప్రధానమంత్రి మోదీ. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.మొఘలులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో గురుగోవింద్ సింగ్ నలుగురు కుమారులైన అజిత్ సింగ్, జుజ్హర్ సింగ్, జొరావార్ సింగ్, ఫతేసింగ్ ఆత్మబలిదానం చేసిన
గుర్తుగా వీర్ బల్ దివస్ జరుపుకుంటున్నారు. ఒకవైపు మొఘల్ సుల్తాన్ల గుడ్డిగా మతహింసకు పాల్పడితే, మరోవైపు మన గురువులు నిలిచారని మోదీ గుర్తుచేసుకున్నారు. సాహిబ్జాదాల సాహసాల గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, వ్యాసరచన, క్విజ్ పోటీలతో పాటు డిజిటల్ ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. సాహసం, శౌర్యం, త్యాగాలకు మారుపేరు సాహిబ్జాదాలకు వీర్ బల్ దివస్ సందర్భంగా జాతి ఘన నివాళులు అర్పిస్తోందని అన్నారు.