తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి నియమితులయ్యారు. శాంతకుమారి 1989 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఆమె గతంలో వైద్యారోగ్య శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె ప్రగతిభవన్లో ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వ సీఎస్ సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే. తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే సోమేశ్ తెలంగాణ నుంచి రిలీవ్ అవ్వాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖనుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో కొత్త సీఎస్ నియామకం అనివార్యమైంది. వెంటనే శాంతికుమారి పేరను ఖరారు చేసింది ప్రభుత్వం. 2025 వరకు ఆమె పదవిలో ఉంటారు.