ఐదు రోజుల క్రితం షారుఖ్ హుస్సేన్ అనే ఉన్మాది చేతిలో కాలిపోయిన జార్ఖండ్ యువతి అంకిత తెల్లవారుజామున కన్నుమూసింది. తాను చూసిన నరకం అతనూచూడాలి. తనకన్నా దారుణంగా అతను చనిపోవాలని ఆమె అన్న చివరి మాటలు అందర్నీ కలిచివేస్తున్నాయి. షారుఖ్ ను విడిచిపెట్టవద్దని వీడియోలో చెప్పింది అంకిత. ఒళ్లంతా కాలిన గాయాలతో నరకం అనుభవిస్తూ ఆమె అన్న చివరి మాటలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దాడికి ముందు తనను షారుఖ్ ఎలా బెదిరించాడో చెప్పింది. ఆ విషయాన్ని తండ్రితో చెప్పానని..అయితే ఆలస్యమైంది పడుకోమని..ఉదయం ఆలోచిద్దామని తండ్రి తనకు నచ్చజెప్పాడని అంకిత వివరించింది.అయితే నిద్రలేవకముందే ఉదయం నాలుగుగంటలకు షారుఖ్, అతని స్నేహితుడు చోటూ గది కిటికీలోంచి తనపై పెట్రోల్ పోసి నిప్పంటించారని అంకిత అంది. కళ్లు తెరిచి చూసేసరికి ఇద్దరూ పారిపోతూ కనిపించారని చెప్పింది. షారుఖ్ ను విడిచిపెట్టవద్దని, అతనూ తనలాగే నరకం అనుభవిస్తూ చావాలని వేడుతూ అంది. ఐదురోజులుగా నరకం అనుభవించిన అంకిత తెల్లవారుజాము రెండున్నరకు చనిపోయింది.
ఇక మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో షారుఖ్ ,తన సోదరుడు తాము చట్టానికి భయపడబోమని..తమను ఎవరు జైల్లో పెడతారో చూస్తాం…బయటికివచ్చాక ఒక్కర్నికూడా వదలం అని వార్నింగ్ ఇచ్చారనీ చెప్పింది అంకిత.
https://twitter.com/socialgreek1/status/1563898066331377664?s=20&t=ywboLSGW1H–k8MRMKKLog
ఆగస్టు 23 మంగళవారం జార్ఖండ్ దుమ్కాలో అంకితపై దాడి జరిగింది. పొరుగింట్లో ఉండే షారుఖ్ హుస్సేన్ అంకితను ప్రేమించమని వేధిస్తుండేవాడు. ఆమె ఫోన్ కు తరచూ కాల్ చేస్తూ తనను ప్రేమించాలని బెదిరించేవాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని అంకిత తన తండ్రికి చెప్పింది. అయితే మరునాడు తెల్లవారుజామునే ఆమె మంటల్లో కాలిపోయింది. తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ముందు దుమ్కాలోని ఫూల్ జానో మెడికల్ కాలేజి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో రాంచీ రిమ్స్ కు తరలించారు. చికిత్సపొందుతూ ఐదోరోజు ఆమె కన్నుమూసింది. ఆమె మరణవాంగ్మూలం తీసుకున్న పోలీసులు షారుఖ్ ను అరెస్ట్ చేశారు.
అంకిత బతుకుతుందని కుటుంబసభ్యులు ఆశపడ్డారు. కానీ ఆమె ముఖం, కాళ్లు, చేతులు తీవ్రంగా కాలిపోవడంతో ఆమె ప్రాణాలు దక్కలేదు.
https://twitter.com/TrulyMonica/status/1564123065696792576?s=20&t=ywboLSGW1H–k8MRMKKLog