రిపబ్లిక్ భారత్ జర్నలిస్టును డిజిటల్ తవైఫ్ అంటూ అంటే డిజిటల్ వేశ్య అంటూ అవమానించింది షాహీన్ భాగ్ నిరసనలతో వార్తల్లోకెక్కిన మహిళ ఐమన్ రిజ్వీ. అదిప్పుడు సోషల్మీడియోలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మే 9న ది నేషన్ వాయిస్ పోస్ట్ చేసింది. ఇందులో రిపబ్లిక్ భారత్కు చెందిన మహిళా జర్నలిస్ట్పై దాదాపు దాడిచేస్తున్నట్టు మీదమీదకువచ్చింది ఐమన్ రిజ్వీ.2020 ఆగస్టులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోవిడ్-19 సోకినప్పుడు అతనిచావుకోసం ప్రార్థనలు చేయాలని ముస్లిం సమాజాన్ని కోరినమహిళే ఈ రిజ్వీ. ఆ వీడియోలో జర్నలిస్ట్ తనను వదిలేయమని వేడుతూనే ఉంది. అయినా రిజ్వీ ఆమె సమీపానికి వచ్చి దుర్భాషాలాడింది.
బుల్డోజర్ వచ్చినా ఇక్కడ ఏం చర్యలు తీసుకోలేకుండానే తిరిగి వెళ్లిపోతుంది. గోడీ మీడియా డిజిటల్ వేశ్యలు దాన్ని చూపించడానికి సిద్ధంగా ఉంటాయి అని వ్యాఖ్యానించింది ఐమన్. అదే చానల్ మరో వీడియోను ప్రసారం చేసింది. అందులో మహిళాజర్నలిస్టును కొందరు మగవాళ్లు చుట్టుముట్టి దుర్భాషాలాడుతున్నారు. దూరం జరగమని ఆమె వేడుతున్నా వినడం లేదు. చుట్టూ ఉన్నవాళ్లు చోద్యం చూస్తున్నారు తప్ప ఆమెను రక్షించే ప్రయత్నమే చేయడం లేదు. అయితే జర్నలిస్టుపై దాడిచేసిన ఐమన్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు నువ్వు మహిళవేనా…ఓమహిళా జర్నలిస్టుమీద దాడి చేసినంత పనిచేస్తావా…మగవాళ్లు చుట్టుముడితే ఆపవా..కిందపడినా జాలి చూపవా… అసలు ఎందుకు అంత సీన్ క్రియేట్ చేశావ్. అసలు నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు అని నిలదీస్తున్నారు. అసలైతే కవరేజ్ అక్కడకు ఇతర మీడియా జర్నలిస్టులు కూడా వచ్చారు. కానీ రైట్ వింగ్ మీడియా హౌస్ అయిన రిపబ్లిక్ చానల్ తోనే వాళ్లకు సమస్య. అందుకే దాదాపు ఆమెపై దాడిచేసినంత పనిచేశారు అక్కడున్నవాళ్లు.
ఇక సదరు జర్నలిస్టును అవమానం ఎదురైనందుకు లిబరల్స్ సంబరాలు చేసుకున్నారు. షాహీన్ బాగ్ లోని ఓ మహిళ… బుల్డోజర్ ను గోడి మీడియా జర్నలిస్టు పైకి అడ్డంగా నడిపింది. రిపబ్లిక్ భారత్ ప్రతినిధులకు మంచిపనే అయింది. ఎక్కడికెళ్లినా వాళ్లకిదే శాస్తి జరుగుతుంది అని నాతిక్ హక్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. షాహిన్ భాగ్ గోడి మీడియాకు వారి విలువను చూపుతోంది అని నయీమ్ అనే వ్యక్తి అన్నారు. ఇక అస్రార్ అహ్మద్ అనే నెటిజన్ జర్నలిస్టు కింద పడిపోయిన వీడియోను షేర్ చేస్తూ ఎగతాళి చేశాడు.
#शाहीनबाग की इस #महिला ने #गोदीमीडिया की 'इमानदार' एंकर पर ही #बुलडोज़र चला दिया | 😜
ये @Republic_Bharat वाले मंदिर का घंटा हो गए है, जहां श्रद्धालु मिलता बजना शुरू कर देता ||
'तूने मारी एंट्रियां रे
दिल में बजी घंटियाँ रे
टंग टंग टंग' 🔔#ShaheenBagh | #Delhi | @republic pic.twitter.com/XxAnE34HSi— Syed Natiq Haq (@syednatiqhaq) May 12, 2022
ఐమన్ రిజ్వీ వివాదాస్పద ముస్లిం మహిళ. తరచూ హిందువులను కించపరుస్తూ వీడియోలు చేస్తుంటుంది. ఇక మోదీ, యోగీ, అమిత్ షా సహా బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తుంటుంది. 2020లో అమిత్ షాకు కోవిడ్ సోకితే ఆయన చనిపోవాలని ప్రార్థనలు చేయాలని ముస్లింలకు పిలుపునిచ్చింది. బీజేపీ నాయకులు ఎవరూ కోవిడ్ తో చనిపోలేదు కనుక అసలు వైరసే ఓ కుట్ర అంది. యోగీని టెర్రరిస్ట్ అంటుంది. బక్రీద్ ను ఆపేందుకు ముస్లింలను కొట్టేందుకు, చంపేందుకు, జైల్లో పెట్టేందుకే కరోనా వైరస్ వ్యాప్తిని హైప్ చేశారని కేంద్రంలోని బీజేపీపై ఆరోపణలు చేసింది ఈ ఐమన్.
गोदी मिडिया के पत्रकारों की उनकी औका़त दिखाती हुई #शाहीन_बाग https://t.co/1MuJmoc3bh
— नईम चौहान نعیم چوہان (@NaimChauhan01) May 10, 2022