హర్యానా పోలీసులు డీఎస్పీ సురేందర్ సింగ్ బిష్ణోయ్ను హత్య చేసిన వారిలో ప్రాథమిక నిందితుడైన ట్రక్ డ్రైవర్ను పట్టుకున్నారు. భరత్పూర్ జిల్లాలోని పహారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగోరా గ్రామంలో నిందితుడిని నిన్న అదుపులోకి తీసుకున్నారు.
https://twitter.com/ANI/status/1549956994877968384?s=20&t=A9IAVA55Jkoqwx_lywoIIA
నిందితుడి పేరు షబ్బీర్ అలియాస్ మిట్టర్ అని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అతని తండ్రి పేరు ఇసాక్. షబ్బీర్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నిరంతరం లొకేషన్ మారుస్తూ ఉన్నాడు, దాంతో అతని లొకేషన్ను ట్రాక్ చేయడానికి.. అతనిని కనుగొనడానికి 10కి పైగా పోలీసు బృందాలను మోహరించారు. పోలీసులు 30కి పైగా ప్రాంతాల్లో దాడులు చేశారు.
టెక్నికల్ సహాయంతో అతడిని ట్రాక్ చేయడం సాధ్యం కానందున.. షబ్బీర్ జాడ కోసం పోలీసులు సోర్సెస్, ఇన్ఫార్మర్లపై ఆధారపడ్డారు. షబ్బీర్, అతని సహచరుడు ఇక్రార్ అక్రమ మైనింగ్ ను అడ్డుకునేందుకు వెళ్లిన డీఎస్పీ బిష్ణోయ్ను తమ ట్రక్కుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేశారు. ట్రక్ క్లీనర్ ఇక్రార్ను పోలీసులు మంగళవారం ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి పోలీసులు మిట్టర్ నివాసాన్ని శోధించినప్పుడు, అది తాళం వేసి ఉందని.. అతని కుటుంబంలోని ప్రతి సభ్యుడు పారిపోయారని వారు నిర్ధారించారు.
https://twitter.com/timesofindia/status/1549767646932914176?s=20&t=4mF7tTLeDa1P1kaP2j7Dyw