సేవా భారతి సేవలు విశ్వవ్యాపితం అని.. రాష్ట్రీయ సేవా భారతి జాతీయ అధ్యక్షులు పన్నాలాల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సేవా భారతి వందల సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేపడుతోందని ఆయన అన్నారు.
సేవా భారతి సేవలలో భాగంగా.. SPMCIL కంపెనీ సహాయంతో బోయినపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో స్వయం ఉపాధి లో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన జనరల్ డ్యూటీ అసిస్టెంట్ బాలికలు.. 12 వ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ వేడుకలు వాత్సల్య సింధు లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్(SPMCIL), చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీకర ప్రధాన్ ముఖ్య అతిథిగా, న్యూఢిల్లీ రాష్ట్రీయ సేవా భారతి అధ్యక్షులు పన్నా లాల్ జి ఆత్మీయ అతిథిగా, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్(SPMCIL) జనరల్ మేనేజర్ దుర్గ ప్రసాద్ ఆచంట విశిష్ట అతిథిగా హాజరయ్యారు . శిక్షణలో అర్హత సాధించిన విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్(SPMCIL), చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీకర ప్రధాన్ మాట్లాడుతూ…. గత రెండు సంవత్సరాలు గా సేవా భారతి కి CSR ఆర్థిక సహాయం చేస్తున్నామని, నిజంగా వారి సేవలు శ్లాఘనీయం అన్నారు. వీరి సేవలు నిరంతరం అప్రతిహరితంగా జరుగుతున్నాయి అన్నారు. సేవా భారతి సేవలు విశ్వవ్యాపితం అన్నారు. అలాగే నిరుపేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సేవ సంస్థ ఒక్క సేవా భారతి సంస్థ యే నని అన్నారు. సేవా భారతి సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అన్నారు.
ఆత్మీయ అతిథిగా హాజరైన న్యూఢిల్లీ రాష్ట్రీయ సేవా భారతి అధ్యక్షులు పన్నా లాల్ జి మాట్లాడుతూ…. తెలంగాణలో సేవా భారతి సంస్థ విస్తృతంగా, ఊహించని విధంగా పని చేస్తుందన్నారు. ఈ రోజు 12 వ బ్యాచ్ లో 90 మంది మహిళలకు స్వయం సహాయక ఉపాధి కల్పించే విధంగా శిక్షణ ఇచ్చాం అన్నారు. ఈ సందర్భంగా సేవా భారతి తెలంగాణ టీమ్ ను ప్రత్యేకంగా అభినందించారు.
జనరల్ మేనేజర్ దుర్గ ప్రసాద్ ఆచంట మాట్లాడుతూ…. సేవా భారతి సంస్థకు CSR సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. సేవా భారతి డైరెక్టర్(వైద్యం, SKILL డెవలప్మెంట్) కుల్దీప్ సక్సేనా మాట్లాడుతూ… సేవా భారతి నిరుపేదల కోసం వైద్య పరంగా రెండు దవాఖాన లు, విద్య పరంగా 40 హాస్టల్స్, సామాజిక , స్వాలంభన పరంగా అనేక సేవలు సేవా భారతి సంస్థ చేస్తుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో సేవా భారతి ప్రతినిధులు ఇతరవిద్యార్థులు, మహిళలు తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.