కోవిషీల్డ్ ధరలను సీరం ఇన్స్టిట్యూట్ బుధవారం ప్రకటించింది. ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400 అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600గా నిర్ణయించింది.
ఉత్పత్తిఅయిన టీకాను 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని, మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇస్తామని సీరం సంస్థ ప్రకటించింది.
రిటైల్ వ్యాపారంలో ప్రత్యేకంగా కార్పొరేట్ సంస్థలకు వ్యాక్సిన్ను సరఫరా చేయడం సవాలుతో కూడుకున్నదంటూ…నాలుగైదు నెలల్లో మార్కెట్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేటు ఆరోగ్య వ్యవస్థల ద్వారా వ్యాక్సిన్లను పొందాలని కార్పొరేట్, ప్రైవేటు సంస్థలను కోరింది.
అటు ఇతర వాక్సిన్ ధరలతో పోలిస్తే కోవిషీల్డ్ ధర తక్కువేనని చెప్పవచ్చు. అమెరికన్ వ్యాక్సిన్ల ధర ఒక డోసు సుమారు రూ.1,500 ఉంటే…రష్యా, చైనా వ్యాక్సిన్ల ఒక డోసు ధర రూ.750కి పైనే ఉంది.