ముస్లింల ఓట్లు కొల్లగొట్టేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగిన ఎంఐఎంను పొమ్మన్నారు యూపీ ఓటర్లు. ఇతర ప్రధాన పార్టీల కన్నా ముందు నుంచి అక్కడే పాగా వేసి ఊరూ వాడా తిరిగారు పార్టీ చీఫ్ అసదుద్దీన్. ముస్లిం ఓటర్లు ప్రభావవంతంగా ఉన్న 100 సీట్లలో ఆ పార్టీ పోటీ చేస్తే ఒక్కచోటా కనీసం డిపాజిట్ దక్కలేదు. కేవలం 0.49 శాతం ఓట్లు సాధించిందాపార్టీ. ఎస్పీ అజంగఢ్ ఫార్ములా తరహాలో దళితులకూ టికెట్లిచ్చారు. కానీ ఆయన పథకం పారలేదు. ఎన్నికల ర్యాలీకి వేలాదిగా, లక్షలాదిగా ప్రజలు హాజరైనా ఓట్లుమాత్రం పడలేదు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)