తెలంగాణ రాష్ట్ర చరిత్ర లో సెప్టెంబర్ 13 ప్రత్యేకమైన రోజని బిజెపి రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి అన్నారు…
బీజేపీ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సుహాసిని రెడ్డి మాట్లాడుతూ…
హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయడానికి భారత దేశ హోమ్ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ పోలీస్ చర్య ప్రారంభించిన రోజు సెప్టెంబర్ 13 అని,
కేవలం 4 రోజుల్లో నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించారని అన్నారు..
ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ అగర్వాల్,గంగన్నసతీష్ రెడ్డి,అజయ్,శివ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.