సంచలనంగా మారిన రాహుల్ గాంధీ ట్వీట్.. సోషల్ మీడియాలో కాంగ్రెస్,కమలం ఫైట్..!
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ సారి రొటీన్కు భిన్నంగా మోదీని నియంతతో పోల్చే విధంగా అర్ధం వచ్చేలా ట్వీట్ చేశారు. రాహుల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా.. కాంగ్రెస్,బీజేపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వార్కు తెరలేపింది. ప్రపంచంలోని నియంతల పేర్లను చెబుతూ.. వారందరి పేర్లు “ఎం(M)” అనే ఇంగ్లీష్ అక్షరంతోనే ఎందుకు మొదలవుతున్నాయంటూ రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో
పోస్ట్ చేశారు.
మార్కస్, ముస్సోలినీ, మిలోసెవిక్, ముబారక్, మొబుటు, ముషారఫ్, మికోంబెరో వంటి వారి పేర్లను చెబుతూ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారడమే కాకుండా.. కాంగ్రెస్,కమలం శ్రేణుల మధ్య బిగ్ ఫైట్కు దారితీసింది. కొందరు మోదీ పేరు కూడా ఎం అక్షరంతోనే మొదలవుతుందని విమర్శలు చేస్తుంటే.. మరి మౌన ముని మన్మోహన్ సింగ్ పేరు కూడా ఎం అనే అక్షరంతోనే మొదలవుతుందని కౌంటర్ అటాక్ చేస్తూ రాహుల్ను ఎదురు ప్రశ్నిస్తున్నారు.