మదర్సాలలో అందుతున్న చదువుల మీద సుప్రీంకోర్టు లో సంచలన వాదనలు జరిగాయి ముఖ్యంగా అక్కడ విద్యార్థులు విద్యావ్యవస్థ ఉపాధ్యాయులు శిక్షణ నాణ్యత అనే అంశాల మీద వాదనలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరఫునుంచి నిపుణుల కమిటీ తమ అభిప్రాయాలు సుప్రీంకోర్టుకి అందించింది.
వాస్తవానికి మదర్సాలలో అందుతున్న ప్రతిమల మీద అలహాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయింది. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు తన తుది తీర్పు వెలువరించింది. యూపీ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్ 2004ని హైకోర్టు రద్దు చేసింది. ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు అయింది పిటీషన్ ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఏప్రిల్ 5న స్టే విధించింది.
ఈ కేసు విచారణలో భాగంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సమగ్రమమైన వాదనలు వినిపించింది. జాతీయ విద్యా హక్కు చట్టం లోని అంశాలు మదర్సాలలో అమలు చేయడం లేదని విద్యా ప్రమాణాలు ఏమాత్రం పాటించడం లేదని స్పష్టం చేసింది. ఆరోగ్యకరమైన వాతావరణం, అభివృద్ధికి మెరుగైన అవకాశాలను కూడా కోల్పోయారని కమిషన్ అఫిడవిట్లో పేర్కొంది. వీరికి మధ్యాహ్న భోజనం, యూనిఫాం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వంటి సౌకర్యాలు అందడం లేదని తెలిపింది. ‘మదర్సాలలో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు, వీరిని ఖురాన్, మత గ్రంథాల పరిజ్ఞానం ఆధారంగా నియమించారు. ఉపాధ్యాయులు కావడానికి అవసరమైన శిక్షణ కూడా తీసుకోలేదు. ఇటువంటి సంస్థలు ముస్లిమేతరులకు కూడా ఇస్లామిక్ మతపరమైన విద్యను అందిస్తున్నాయి, ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 28 (3)ను ఉల్లంఘించడమే.’ అని అఫిడవిట్ పేర్కొంది.
అదే మాదిరిగా తరగతుల సిలబస్ లకు సంబంధించి కమిషన్ స్పష్టమైన వివరాలను అందించింది. మదర్సాలో విద్యనభ్యసించే పిల్లవాడు పాఠశాలలో బోధించే పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని కోల్పోతాడని కమిషన్ తన అఫిడవిట్లో చెప్పింది. మదర్సా బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న పుస్తకాల జాబితాను పరిశీలించిన తర్వాత ఇస్లాం ఆధిపత్యం గురించి పాఠాలు బోధిస్తున్న ట్లు తేలిందని కమిషన్ తెలిపింది.
అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిమీద విచారణ జరుపుతోంది. మరోవైపు విదేశీ నిధులతో వేల సంఖ్యలో మదర్సాలు నడుస్తున్నాయని, రాష్ట్రంలోని మదర్సాలన్నింటికీ విదేశీ నిధులపై విచారణ జరిపేందుకు యూపీ ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసింది. కొన్ని మదర్సాలలో అక్రమాలు జరిగాయని తన నివేదికలో సిట్ వెల్లడించింది. ఆరు నెలలుగా విచారణ చేపట్టిన సిట్ తన రెండు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. విచారణ పూర్తయిన తర్వాత తుది నివేదిక ఇవ్వనున్నారు.
సుప్రీంకోర్టులో విచారణ పూర్తి అయిన తర్వాత తుది తీర్పు వెలబడుతుంది. అప్పుడే ఈ విషయంలో పూర్తిస్థాయి స్వస్థత వచ్చే అవకాశం ఉంది.