సీనియర్ న్యాయవాది ,ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సెక్రటరీ జఫర్యాబ్ జిలానీ కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జిలానీ లక్నోలోని తనింట్లో చనిపోయారు. అయోధ్య రామజన్మభూమి కేసులో బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ తరపున ఆయన వాదనలు వినిపించారు. గతంలో ఉత్తరప్రదేశ్ అదనపు ఏడీజీగా ఆయన పనిచేశారు. మే 2021లో ఓ ప్రమాదంలో జిలానీ తలకు గాయమైంది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో పరిస్థితి విషమించింది. ఆపరేషన్ తరువాత క్రమంగా కోలుకున్నారు.
అయోధ్య కేసులో ముస్లింల తరపున సుప్రీంలో వాదనలు వినిపించారు. మసీదు కోసం ఐదుఎకరాలను కేటాయించాలని సుప్రీం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తరువాత
బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ (BMAC)కి జఫర్యాబ్ జిలానీ అధ్యక్షుడయ్యాడు. కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యస్థితి క్రమంగా విషమిస్తోంది.. లక్నోలోని నిశాంత్గంజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.