కోవిడ్ ప్రపంచాన్ని వణికించింది. మొదటి వేవ్ లోలాక్డౌన్ వంటి చర్యలతో వైరస్ కు అడ్డుకట్ట వేయగలిగాం.
తరువాత మాస్కులు, వాక్సిన్లతో అడ్డుకోగలిగాం. ఎన్ని చర్యలు తీసుకున్నా ఆ ప్రాణాంతకమహమ్మారి మనలో కొందర్ని పొట్టనపెట్టుకుంది. వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతున్న కొద్దీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. మొదట్లో కొన్నిరోజుల లాక్డౌన్ కే జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే హర్యానా గురుగ్రామ్ లో ఓ మహిళ మాత్రం మూడేళ్లుగా తన కొడుకుతో ఇంటిలోపలే ఉండిపోయింది. తాముండే అపార్ట్ మెంట్లోకి..బయటకు వెళ్లి పనిచేసే తన భర్తను కూడా రానీయలేదు. పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగినా కూడా తన కుమారుడిని బయటకు పంపకపోవడం, తానులోపలే తాళం వేసుకుని ఉంటుండటంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మహిళాశిశు సంక్షేమ అధికారులతో కలిసి వెళ్లిన పోలీసులు తలుపులు తీయించి ఇద్దర్నీ బయటకు తీసుకువచ్చారు.
మొదట్లో అందర్లాగే కోవిడ్ కు భయపడి లోపలే ఉండిపోయిందనుకున్నానని తరువాత ఎంత బతిమలాడినా తలుపు తీయలేదని, తననూ ఇంట్లోకి రానివ్వలేదనీ ఆమె భర్త వాపోతున్నాడు.ఈ మూడేళ్లు భర్త మరో ఫ్లాట్ అద్దెకు తీసుకుని ఉన్నాడు. వాళ్లకు కావల్సిన సరుకులు మాత్రం పంపిస్తూ ఉండేవాడు. కోవిడ్ సమయంలో 8 ఏళ్లున్న పిల్లాడు ఇప్పుడు పదకొండేళ్లవాడయ్యాడు. మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు వారికి నచ్చజెప్పి బయటకు రప్పించారు. అనంతరం వైద్య పరీక్షలకోసం ఆస్రత్రికి తరలించారు. వారి మానసిక పరిస్థితి బాగానే ఉందని…అయితే కొంతకాలం పర్యవేక్షించాలనీ వైద్యులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1628495341313228800?s=20
https://twitter.com/ANI/status/1628495345884995584?s=20