….
దర్శకుడు శేఖర్ కమ్ముల మొదట నుంచీ హైందవ ధర్మం విషం చిమ్ముతూ ఉంటారు. ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక రూపంలో హైందవ ధర్మాన్ని కించపరిచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. కథ, కథనంలో అవసరం లేకపోయినా అటువంటి సన్నివేశాలను ఎంచుకొంటూ ఉంటారు. అందుకే సినిమా, మీడియా రంగంలోని కమ్యూనిస్టు భక్తులంతా ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. తెలుగు భాషలోనే అత్యంత క్రియేటివ్ డైరక్టర్ అనీ, బయట సమాజంలో కూడా చాలా చాలా విలువలు ఉన్న వ్యక్తి అంటూ బిల్డప్పులు ఇస్తూ ఉంటారు. ఇదంతా శేఖర్ కమ్ములకు కమ్యూనిస్టులు చేసే బ్రాండ్ బిల్డప్ అన్న మాట.
….
కుబేర సినిమా లో కూడా దర్శకుడు శేఖర్ కమ్ముల చాలా కుప్పిగంతులు వేశారు. ముఖ్యంగా హీరో ధనుష్ ను తిరుపతి పట్టణంలో బిచ్చగాడిగా నిలిపి ఉంచారు. దేశంలో చాలా పట్టణాలు ఉండగా తిరుపతి పట్టణాన్నే ఎంచుకోవటంలోనే ఈ కుట్ర దాగి ఉంది. పైగా ఆకలితో అల్లాడుతున్న ధనుష్.. అన్నం కోసం మసీదులు వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. అక్కడ అయితేనే నిరుపేదలకు మధ్యాహ్నం పూట భోజనం దొరకతుంది, మసీదులు మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అని శేఖర్ కమ్ముల చాటి చెప్పాడు. నిజానికి తిరుమల పుణ్యక్షేత్రంలో నిరంతరాయంగా అన్న ప్రసాదం భక్తులకు ఉచితంగా పెడుతూ ఉంటారు. శ్రీ వేంగమాంబ అన్నసత్రంలో రక రకాల కూరలతో ఉచితంగా నాణ్యమైన భోజనం లభిస్తుంది. అటువంటి పుణ్యక్షేత్రంలో అన్నార్తుల\కు హిందూ ఆలయాల్లో ఏమాత్రం తిండి దొరకదు, కేవలం మసీదులకు వెళితేనే అన్నం దొరకతుంది అని చూపించటం అంటే శేఖర్ కమ్ముల పైత్యం ఏమనుకోవాలి.. లేదా అడిగే దిక్కు లేదు అనుకోవాలా..
….
అంతే కాదు ఈ సినిమా నిండా డొల్లతనమే కనిపిస్తుంది. పైగా శ్రీ వేంకటేశ్వర స్వామికి, కుబేరుడికి ఉన్నసంబంధాన్ని గుర్తు చేస్తూ.. ఈ సినిమాకు కుబేర అనిపేరు పెట్టి, దీనిని తిరుపతి కేంద్రంగా రూపొందించారు. పైగా సినిమా కథకు సీఈవో ని చేయాలంటే హీరో ధనుష్ బిచ్చగాడే అవసరం లేదు, సామాన్య నిరుద్యోగి అయినా సరిపోతాడు కానీ … ఇక్కడ శేఖర్ కమ్ముల మాత్రం హీరోని తిరుపతి లో ఉండే బిచ్చగాడిగా చూపించారు. అక్కడ ప్రజలకు హైందవ భక్తుల నుంచి ఎటువంటి ఆసరా లేనట్లుగా చూపించారు. ఫిజికల్ గా మాంచి ఫిట్ గా ఉండే ధనుష్ .. ఏదయినా పనీ, పాట చేసుకొనే అవకాశం ఉంటుంది కానీ దేవీ దేవతలను అవమానించేందుకే అతడ్ని బిచ్చగాడిగా చూపించారు. పైగా తిరుపతిలో మారు వేషంలో వచ్చి భిక్షం అడుక్కొన్నానంటూ ధనుష్ నంగనాచి కబుర్లు చెప్పటం మరో విశేషం.
….
శేఖర్ కమ్ముల గత సినిమాల్లో కూడా ఇలాంటి పోకడలే కనిపిస్తాయి. అనాథ ఆశ్రమాల గురించి చూపించాలంటే అక్కడ చర్చిలు, క్రైస్తవ మిషనరీలు నన్ ల ఫోటోలను చూపించేస్తారు. చర్చిలు, మసీదులలో పేదలకు అన్నదానాలు జరుగుతాయని చూపిస్తూ ఉంటారు. కానీ విలన్స్ మాత్రం పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకొని క్రిమినల్ పనులు చేస్తారని పిక్చరైజ్ చేస్తూ ఉంటారు. ధనవంతులు అంటే ఏ మాత్రం విలువలు పాటించరని, డబ్బే సర్వస్వంగా బతుకుతూ ఉంటారని, పేదలు భిక్షగాళ్లు మాత్రమే విలువలను పాటిస్తూ ఉంటారని శేఖర్ కమ్ముల.. చక్కగా కమ్యూనిస్టు పాఠాలు చెబుతూ బతికేస్తూ ఉంటారు. అటువంటప్పుడు తాను కూడా చిన్న ప్రొడ్యూసర్స్ కు, చిన్న నటులకు అవకాశం ఇవ్వవచ్చు కదా, కానీ శేఖర్ కమ్ముల మాత్రం అలా చేయరు. బడా హీరో హీరోయిన్స్, బడా ప్రొడ్యూసర్స్ తోటే కాలక్షేపం చేస్తూ ఉంటారు.
….
శేఖర్ కమ్ముల మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది దర్శక నిర్మాతల పరిస్థితి అంతే. హీరోలు, సామాజిక కార్యక్రమాలు అంటే మసీదులు చర్చిలను చూపించటం, విలన్స్, దుర్మార్గాలు అంటే హిందూ దేవీ దేవతల పూజలు చూపించటం అలవాటు గా మారిపోయింది. ఇంత దుమారం రేగుతున్నప్పటికీ, శేఖర్ కమ్ముల వంటి దర్శకులలో రియలైజేషన్ రాకపోవటం దారుణం.