తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం యాత్ర ఏడోరోజు కొనసాగుతోంది. ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో ఆయన యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా క్లాక్ టవర్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ జగన్ సర్కారుపై మండిపడ్డారు. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. జగన్ హయాంలో ఒక్క కంపెనీ అయినా రాష్ట్రానికి వచ్చిందా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా అని నిలదీశారు. జగన్ రెడ్డిని చూసి ఇక్కడికి రావల్సిన కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆయన విమర్శించారు. ఇబ్బంది పడుతున్నచిత్తూరుటమాటా రైతులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.