భారత్ జోడోయాత్రలో భద్రతాలోపాలు, శుక్రవారం యాత్ర నిలిచిపోవడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖరాశారు. భారత్ జోడో యాత్ర సజావుగా సాగేందుకు తగినంత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు తగిన జోక్యం చేసుకోవాలని కోరారు. ఖాజిగుండ్లో రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందిని జమ్మూకశ్మీర్ పోలీసులు శుక్రవారం ఉహసంహరించడంతో యాత్రను సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఖర్గే లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రెండు రోజ్లుల్లో పెద్ద సంఖ్యలో జనం యాత్రలో పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నామని… మీరు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, యాత్ర ముగిసేంత వరకూ తగిన భద్రతా ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతున్నామని అన్నారు. రాహుల్ సారథ్యంలోని భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమై 12 రాష్ట్రాల్లో పర్యటించి ఈనెల 30న శ్రీనగర్లో ముగియనుంది.