శ్రీనగర్లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని మెహ్రాన్ యాసీన్ షల్లా, అరాఫత్ అహ్మద్ షేక్, మంజూర్ అహ్మద్ మీర్గా గుర్తించారు. మెహ్రాన్ యాసీన్ షల్లా లోయలోని పాక్ ఉగ్రవాద సంస్థ లష్కర్ ముందున్న టిఆర్ఎఫ్ కమాండర్.
సిక్కు ప్రిన్సిపాల్ సుపీందర్ కౌర్, హిందూ ఉపాధ్యాయుడు దీపక్ చంద్ హత్యలో షల్లా ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. ఈ ఏడాది అక్టోబర్ 7న పాఠశాలలోకి వెళ్లి ఆ ఇద్దరు టీచర్లను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 26న శ్రీనగర్లో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఒక పౌరుడు మరణించగా, మరో ముగ్గురు గాయపడిన ఘటనలో కూడా ఇతను ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు సమాచారం.
ఆస్పత్రిలో చూపించుకుని పోలీస్ స్టేషన్ కు తిరిగి వస్తున్న శ్రీనగర్లోని ఖన్యార్ పీఎస్ఐ అర్షద్ అహ్మద్ మీరునూ మరికొందరితో కలిసి పొట్టనపెట్టుకున్నాడు మెహ్రాన్ యాసిన్.